Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుబాటులోకి మొబైల్ కరోనా టెస్టింగ్ బస్
- నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ-సిద్దిపేట టౌన్
సిద్దిపేట ప్రజల ముంగిట్లో ఎన్నో సేవలు అందిస్తున్న మంత్రి హరీష్ రావు, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యం, ఆత్మవిశ్వాసం తానున్న అనే భరోసాతో మరో ముందడుగు వేస్తూ వ్యాధి లక్షణాలు ఉన్న ప్రజలకు వారి చెంతనే సులువుగా పరీక్షలు చేసేందుకు మొబైల్ బస్ ద్వా రా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సదుపాయం వలన వ్యాధి లక్షణాలతో ఉన్న వ్యక్తి ప్రభుత్వాస్పత్రికి వెళ్లేందుకు వ్యయ ప్రయాసాలు ఉండవు. సిద్దిపేట వైద్య కళాశాలకు ఇండియా కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అనుమతి ఇవ్వ డంతో, సిద్దిపేటలోని కరోనా నమూనాల సేకరణ తో పాటు, దాని ఫలితాలను వెల్లడించే అవకాశం లభించింది. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో సిద్దిపేట వైద్య కళాశాలకే తొలి అనుమతి రావడం వెనుక మంత్రి హరీష్ రావు కషి ఉన్నది. ఇక హైదరాబాద్కు నమూనాలను పంపించే అవసరం లేకుండా పోతుంది. గతంలో టెస్ట్ కు వెళితే నమూనాలు సేకరించి హైదరాబాద్ కు పంపాం. ఫలి తాల కోసం వేచి ఉన్నాం. అనే మాట నిన్నటి దాకా వైద్య అధికారులు తెలిపారు, కానీ ఇక ముందు నుండి ఇక్క డ టెస్ట్ లు చేయించుకున్న 8 గంటల్లోనే సిద్దిపేట వైద్య కళా శాలలోనే ఫలితాలు రనున్నారు. మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ తో తెలంగాణ రాష్ట్రంలో తొలి వైద్య కళాశాల సిద్దిపేట కు ఆర్టీపీసీఆర్ టెస్ట్ లకు ( వ్యాధి నిర్ధారణ ) అఖిల భారత ఇండియన్ వైద్య పరిశోధన అనుమతి ఇచ్చింది. నేడు మంత్రి హరీష్రావు కేంద్రాన్ని, బస్సును ప్రారంభించనున్నారు.