Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య
నవతెలంగాణ-గజ్వేల్
కరోనా కష్టకాలంలో కార్మికులను ఆదుకోవాలని సీఐ టీయూ జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య అన్నారు. గురువారం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్లోని రాణే బ్రేక్ పరిశ్రమ గేటు ముందు కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు నెల లుగా అన్ని తరగతుల ప్రజల జీవితాలను అతలా కుతలమవుతున్న సందర్భంగా, పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఉచితంగా కరోనా టెస్టులు చేయిం చాలని, ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ పీరియడ్లో పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలన్నారు. అన్నారు. కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీఐట ీయూ జిల్లా సహాయ కార్యదర్శి బండ్ల స్వామి, సీఐటీయూ రాణే పరిశ్రమ యూనియన్ ప్రధాన కార్యదర్శి వేణు గోపా ల్, యూనియన్ నాయకులు వెంకట్ రాములు, రంగారెడ్డి, కుతుబుద్దీన్, ఆర్. నర్సింలు, చంద్రశేఖర్ రెడ్డి, పరిశ్రమ కార్మికులు పాల్గొన్నారు.
జేఎల్ఎం ర్యాంకుల్లో అనుమానాలను నివృత్తి చేయాలి
జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ (విద్యుత్) రాత పరీక్ష ఫలితాల ర్యాంకుల జాబితాను క్రమపద్ధతిలో వేయకుండా ఇష్టానుసారంగా వేసి సిద్దిపేట సర్కిల్ ఆఫీస్లో అందించారని దానిలో పలు అనుమానాలు కలిగే విధంగా ఉన్నాయని సీఐటీయూ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు సందబోయిన ఎల్లయ్య, కాముని గోపాలస్వామి అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ పది లోపు ర్యాంకు ఉన్న వారి పేరు, వంద ర్యాంకుల తర్వాత ఉన్నదని, 81, 82 ర్యాంకులు వచ్చిన వారి పేరు లిస్ట్లో లేదన్నారు. స్థానికులు జిల్లా నిరు ద్యోగులకు ఉపాధి కల్పించకుండా, ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి పేరు జాబితాలో ఉందన్నారు. సెప్టెంబర్ 5న జరుగు పోల్ ప్లంబింగ్ టెస్ట్ కాల్ లెటర్లు పంపించారన్నారు. క్వాలి ఫై అయిన అభ్యర్థులను పిలిచి సమగ్రంగా జాబితా రూపొ ందించి ,అనుమానాలు నివత్తి చేయాలని ,స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.