Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యావాలంటీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జోగినాథ్ యాదవ్
నవతెలంగాణ-మెదక్ టౌన్
కరోనా నేపథ్యంలో విద్యవాలంటీర్ల బతుకులు భారంగా మారాయని రాష్ట్ర విద్యా వాలంటీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జోగినాథ్ యాదవ్ అన్నారు. గురువారం వారు విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథ మికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 12,000 మంది విద్యా బోధన చేస్తుండగా మెదక్ జిల్లా వ్యాప్తంగా 584 మంది విద్యా వాలంటీర్లు ఉన్నారని తెలిపారు. విద్యావలంటీర్లకు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వేతనాలు ఇవ్వడం లేద న్నారు. దాంతో తాము వ్యవసాయ కూలీలుగా, అడ్డా కూలీ లుగా, ఉపాధిహామీ పథకం పనులకు, భవనాల నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నామని వాపోయారు. దయచేసి ప్రభుత్వం స్పందించి విద్యా వాలం టీర్లకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని కోరుతున్నామన్నారు. జిల్లా అధ్యక్షులు బాలసాయి హరిప్రసాద్ మాట్లాడుతూ విద్యా వాలంటీర్లకు 2020 సంవత్సరానికి ఉత్తమ విద్యా వాలం టీర్లుగా అవార్డులు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈ నెల 17 నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవుతున్నారని, వారితో పాటు విద్యా వాలంటీర్లను కూడా విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.