Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుస్నాబాద్ టౌన్
హుస్నాబాద్ నియోజకవర్గంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నా అధికారులు వ్యాధి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని కాంగ్రెస్ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ విమర్శించారు. వైరస్ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఇప్పటికైనా హుస్నాబాద్ లోని ప్రభు త్వాస్పత్రిలో ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమా ండ్ చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుస్నాబాద్, అక్కనపేట మండలాల్లో ఇప్పట ివరకు 457 మందికి కరోనా టెస్టులు నిర్వహించారని, ఇందులో 60 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. హౌమ్ ఐసొలేషన్లో బాధితులు ఇబ్బందులు పడుతున్నా, ఎమ్మెల్యే సతీశ్ కుమార్ పట్టించుకోకపోవడం దారుణంగా ఉందన్నారు. కరోనాను ఈటల రాజేందర్ వెయ్యి రూపా యలతో తగ్గించుకోవచ్చని చెబుతున్నారని, అలా అయితే కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నిం చారు. హుస్నాబాద్ ప్రాంతానికి నలువైపులా నలుగురు మంత్రులు ఉన్నా ఈ ప్రాంతాన్ని పట్టించుకోవట్లేదని మం డిపడ్డారు. ఇప్పటికైనా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లేదంటే ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కౌన్సిలర్ వల్లపు రాజు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు బూరుగు కిష్టస్వామి, నాయకులు కుమా రస్వామి, బైరి శ్రీనివాస్, రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.