Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వార్డు సభ్యుల ఫోరం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రాజు
నవతెలంగాణ-హుస్నాబాద్ టౌన్
పంచాయతీల్లో నిధుల వినియోగాన్ని ప్రజలకు తెలిసేలా నోటీసు బోర్డుపై ప్రకటించాలని వార్డుసభ్యుల ఫోరం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రాజు డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పంచాయతీ ఆదాయం, వ్యయాలను కచ్చితంగా చూపించాల్సి ఉన్నా సర్పంచులు, కార్యదర్శులు గోప్యంగా ఉంచుతున్నారన్నారు. ఇంటి, నీటి పన్నులతో పాటు, ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, ఇతర ఆదాయ వ్యయాలను కచ్చితంగా నోటీసు బోర్డుపై ప్రక టించాలన్నారు ప్రతి నెలా వీధి లైట్లు చెక్ చేసి, ఎన్ని వేశారో కూడా నోటీసు బోర్డుపై చూపాలన్నారు. ప్రతి నెలా నిర్వహి ంచే గ్రామ సభకు ప్రజలను ఆహ్వానించడంలేదని, ఇది సరికా దన్నారు. ఇప్పటికైనా పంచాయతీ పాలనలో పారదర్శకత పాటించాలని, లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.