Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పీ శంకర్
నవతెలంగాణ-మిరుదొడ్డి
దళిత రైతు బ్యాగరి నర్సిములు ఆత్మహత్యకు బాధ్యులైన నిందితులు సర్పంచ్, తహసీల్దార్, వీఆర్వోలను అరెస్టు చేసె వరకు దళిత సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ అధ్వర్యంలో ఐక్య ఉద్యమం చేస్తున్నట్లు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ తెలిపారు. గురువారం మిరుదొడ్డిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితులలో సర్పంచ్ పాపిరెడ్డి కేసు పెట్టినప్పటికీ అరెస్టు చేయలేదన్నారు. వీఆర్వో, తహసీల్దారు ల పై సైతం ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చే సి కఠినంగా శిక్షించాలని, బాధిత కుంటుంబానికి నష్ట పరి హారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే జిల్లా కలెక్టర్, గజ్వేల్ ఆర్డీవో కార్యాలయాల ముందు ధర్నా చేసి, గజ్వేల్ ఏసీపీకి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ప్రభుత్వం నుండి సరైన స్పందన రానందున ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలలో నల్ల బ్యాడ్జిలతో నిరసన, 16 న జిల్లాలోని మండల కేంద్రాలలో అంబేద్కర్ విగ్రహాల ముందు ధర్నాలు,17న ప్రజ్ఞాపూర్లో రాజీవ్ రహదారి దిగ్బంధం, 20న మంత్రి హరీశ్రావు ఇల్లు ముట్టడిస్తామని తెలిపారు. ఈ ఉద్యమంలో దళిత, గిరిజన, రైతు సం ఘాలు,ప్రజాస్వామిక వాదులు పాల్గొనాలని కోరారు. డీబీఎఫ్ రాష్ట్ర నాయకులు ముత్యాల భూపాల్, సిద్దు ,మద్దెల నర్సింలు పాల్గొన్నారు.