Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని
నర్సంపల్లి పంచాయతీ దుస్థితి
నవతెలంగాణ-చేగుంట
నార్సింగ్ మండలంలోని నర్సంపల్లి గ్రామ పంచాయతీ శిధిలావస్థకు చేరింది. చాలా ఏండ్ల క్రితం భవనాన్ని నిర్మించారని ఎప్పుడు కూలుతుందో అన్న భయాందోళనలో గ్రామస్తులున్నారు. ఆ భవనంలో పంచాయతీ కార్య కలాపాలు కొనసాగించడానికి పాలకవర్గం కూడా భయాందోళనకు గురవుతోంది. ఓ సారి సమావేశం ఏర్పాటు చేసి కూర్చున్నప్పుడు పై నుంచి పెచ్చులూడి పాలకవర్గ సభ్యులపై పడడంతో భవనం తొలగించాలని, కొత్త గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించాలని తీర్మానించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి మరీ ఎక్కువగా పెచ్చులు ఎక్కువగా ఊడడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే కొత్త భవన నిర్మాణానికి అనుమతిని ఇవ్వాలని సర్పంచ్ బొమ్మ గారి భారతమ్మ , వార్డు మెంబర్లు , గ్రామ పెద్దలు, గ్రామస్తులు కోరుతున్నారు.