Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విరాళం ఇస్తామంటూ వచ్చి బాలికపై లైంగికదాడి
- సహకరించిన ఆశ్రమ నిర్వాహకులు
- మూత్రాశయంలో ఇన్ఫెక్షన్తో బాలిక మతి
నవతెలంగాణ-అమీన్పూర్
తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన ఓ బాలిక(14) ఆశ్రమం కోసం అనాథశ్రమంలో చేరింది. ఏ ఆదరణ లేని ఆ బాలికను హక్కున చేర్చుకోవాల్సిన ఆశ్రమ నిర్వాహకులే ఆగంతుకుడికి సహకరించారు. విరాళం పేరుతో అనాథశ్రమానికి వచ్చే తండ్రి వయస్సు ఉన్న ఓ దుర్మార్గుడు ఆ బాలికపై అత్యంత క్రూరంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వెదిరి కాలనీలోని మారుతి అనాథశ్రమంలో బోయినిపల్లిలోని రెడ్డి కంపౌండ్ బస్తీకి చెందిన ఓ బాలిక(14)కు తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ చేర్పించారు. అయితే ఆ అనాథశ్రమానికి నిధులిచ్చే నెపంతో అక్కడికి తరచూ వచ్చే వేణుగోపాల్ రెడ్డి (54) అనే వ్యక్తి, బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. అందుకు శరణాలయం నిర్వాహకులు విజయ, జయదీప్ సహకరించారు. లాక్డౌన్ కావడంతో మార్చి 21న బాలికను జీడిమెట్ల షాపూర్నగర్కు చెందిన మేనమామ తన ఇంటికి తీసుకొచ్చి 4 నెలలు ఆలనాపాలనా చూశాడు. కొన్ని రోజులుగా బాలిక జ్వరం, నీరసంతో బాధపడుతుండటంతో అనాథ ఆశ్రమానికి తీసుకెళ్లాడు. బాలికను నిర్వాహకులు లోపలికి అనుమ తించలేదు. దీంతో ఆమెను మేనమామ బోయిన్పల్లి బాపూజీనగర్లో నివాసముండే ఆమె పెద్దమ్మ ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు. బాలిక నీరసంగా కనిపించడంతో అనుమానించిన ఆమె, తాను పనిచేసే యజమాని అయిన రిటైర్డ్ పోలీసు అధికారిణికి విషయం చెప్పింది. బాలికపై ఎవరో లైంగికదాడి చేసివుంటారని అనుమానించిన ఆమె వివరాలు రాబట్టారు. అనంతరం గత నెల 31న పెద్దమ్మ సాయంతో బాలిక తనపై లైంగికదాడి చేసిన వేణుగోపాల్ రెడ్డి, సహకరించిన అనాథాశ్రమం నిర్వాహకులపై బోయి న్పల్లి పోలీసులకు ఫిర్యా దు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను భరోసా సెంటర్కు తరలించారు. కేసును అమీన్పూర్ పోలీసుస్టేషన్కు పంపిం చారు. భరోసా కేంద్రంలో బాలికకు పరీక్షలు నిర్వహించగా గర్భవతి అని నిర్ధారణ అయింది. ఈ నెల 7న బాలిక పరిస్థితి విషమించడంతో నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి అక్కడ చికిత్స పొందుతున్న బాలిక బుధ వారం ఉదయం మతి చెందిందినట్టు ఆస్పత్రి వర్గాలు తెలి పాయి. ఈ కేసును పటాన్చెరు డీఎస్పీ రాజేశ్వరావు దర్యాప్తు చేశారు. నిందితుడు వేణుగోపాల్రెడ్డి, ఆశ్రమం నిర్వా హకులు విజయ, జయదీపపై పోక్సో, అత్యాచార సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
దర్యాఫ్తునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు..
ఈ ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ఈ కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కమిటీలో బాలల హక్కుల కమిషన్, బాలల సంరక్షణ కమిటీ సభ్యులు, ఏసీపీ ప్రతాప్ సభ్యులుగా ఉన్నారు. కమిటీలో మహిళా కమిషన్ కార్యదర్శి జి. సునంద కూడా ఉన్నారు. ఈ కమిటీ సమావేశమై.. ఆ తర్వాత బాలిక కుటుంబసభ్యులు, బంధువులను కలువనుంది. ఆశ్రమం నుంచి తీసుకువచ్చాక ఏం జరిగిందనే దానిపై వివరాలను కమిటీ సభ్యులు తెలుసుకోనున్నారు
మాయమాటలతో దారుణం
అభం శుభం తెలియని బాలికకు మాయమాటలు చెప్పి దారుణంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. కూతురు వయస్సు ఉన్నా కనికరం లేకుండా ప్రవర్తించి.. బాలిక మతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తరచూ ఇలాంటి ఘటనలు పునరావతమవుతున్న ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదు. ఆశ్రమం పేరుతో ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడడం హేయమైన చర్య.
- కాట సుధారాణి, అమీన్పూర్ కౌన్సిలర్
నిందితులను కఠినంగా శిక్షించాలి
అనాథాశ్రమంలో బాలికను మోసం చేసి గర్భవతినీ చేసిన వేణుగోపాల్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి. అతనికి సహకరించిన ఆశ్రమ నిర్వాహకులను వదిలి పెట్టొద్దు. ఆశ్రమం పేరుతో బాలికలను ఇలా మోసం చేయడం దారుణం. దాతల పేరుతో అనేకమంది ఆడపిల్లలను మోసం చేస్తున్నారు. అనాథ ఆశ్రమానికి దాతల పేరుతో ఆశ్రమానికి వస్తున్న వారికి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నావారు సహకరించడం దుర్మార్గం.
- నాయని లలిత,
ఐద్వా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు,