Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడంతోనే దళిత గిరిజనులకు రక్షణ
కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్
నవతెలంగాణ-సంగారెడ్డి టౌన్
70 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో దళితులు గిరిజనులను నేటికీ అంటరానివాళ్ల గానే చూస్తున్నారని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేళ మాణిక్ అన్నారు. కెేవీపీఎస్ కార్యకర్తల సమావేశం సంగారెడ్డిలోని సంఘం జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అనేకచోట్ల ఇప్పటికీ దళితులు గిరిజనుల పైన కుల వివక్షత దాడులు, లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు కులం పేరుతో అనేక అవమానాలు జరుగుతున్నాయని సాంఘిక బహిష్కరణ జరుగుతున్నాయన్నారు. కులాంతర వివాహాలు చేసుకుంటే హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్యాలగూడలో ప్రణరు అమత ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో అంటరానితనం నిషేదమని ఉందని కానీ పాలకుల విధానాలతో కుల వివక్షతను పెంచి పోషిస్తున్నారని అన్నారు. పాలకులు అనుసరిస్తున్న ప్రయివేటీకరణ సరళీకరణ కార్పొరేటీకరణ విధానాలతో దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మహిళలు అభివద్ధికి దూరమవుతారన్నారు ఈ విధానాలతో రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశ సార్వభౌమత్వం పై, ప్రజాస్వామ్య హక్కుల పై న భారత రాజ్యాంగం పై న దాడి చేస్తోందని విమర్శించారు. దేశ రక్షణకు సంబంధించిన అంతరంగిక విషయాలలో కూడా విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఉన్నదన్నారు.కరోనా తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కెేవీపీఎస్ జిల్లా ఉపధ్యక్షులు శివ కుమార్, నాయకులు చంద్రశేఖర్, దత్తు, శ్యామ్ గిరిజన సంఘం నాయకుడు తార సింగ్ తదితరులు పాల్గొన్నారు