Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బీరం మల్లేశం
నవతెలంగాణ-సంగారెడ్డిటౌన్
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పంద్రాగస్టు రోజున వామపక్షాల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బీరం మల్లేశం అన్నారు. శుక్రవారం సంగా రడ్డిలో వామపక్షాలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సుందరయ్య భవన్లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే గొంతులపై దాడులు జరుగు తున్నాయన్నారు. ఎయిర్ఇండియా, బిఎస్ఎన్ఎల్, బీపీసీఎల్, రైల్వే, ఇన్సూరెన్స్, రైల్వే, ఇన్సూరెన్స్, బొగ్గు గనులను ప్రయి వేటుపరం చేయడానికి రంగం సిద్ధం చేసిందన్నారు. దేశ రక్షణకు సంబంధించిన అంతరంగిక విషయాలలో కూడా విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఉన్నదన్నారు. కరోనాతో ప్రజలు ఇబ్బ ందులు పడుతున్నా పట్టించ ుకోవడంలేదన్నారు. ప్రజావ్యతిరేక విధా నాలను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఐక్య పోరాటాలకు పిలుపునివ్వడం జరుగుతోందన్నారు. నేడు ఉదయం 10 గంటలకు అంబేద్కర్ సంగారెడ్డి అంబేద్కర్ చౌక్ దగ్గర రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ ఉంటుందన్నారు. 18న ప్రభుత్వాసుపత్రుల సందర్శన జయప్రదం చేయాలన్నారు. సీపీఐ జిల్లా నాయకులు వజీర్ బేగ్, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు తుల్జారెడ్డి ,కార్యదర్శి కుమ్మరి సాయిలు, నాయకులు గొల్లపల్లి జయరాజు ,కే రాజయ్య, అతిమాల మాణిక్యం పాల్గొన్నారు.