Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
- సిద్దిపేటలో ప్రభుత్వ వైద్య కళాశాలలో
- కోవీడ్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం
నవతెలంగాణ-సిద్దిపేట టౌన్
కరోనాను జయించిన వ్యక్తులు ప్లాస్మా దానానికు ముందుకు రావాలి రాష్ట్ర మంత్రి హరీష్ రావు పిలుపు నిచ్చారు. శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో కోవీడ్ టెస్టింగ్ (ఆర్టీపీసీఆర్) ల్యాబ్ను, మున్సిపల్ కార్యా లయం ఆవరణలో మొబైల్ టెస్టింగ్ బస్ను జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వేలేటి రోజా శర్మ, జిల్లా కలెక్టర్ వెంక ట్రామరెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు వేగంగా చేసి వెంటనే ఫలితాలు ప్రకటించేందుకు వీలుగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కోవీడ్ టెస్టింగ్ (ఆర్టీపీసీఆర్) ల్యాబ్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ఒక్క రోజులోనే ఫలితాలు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో ప్రభుత్వ వైద్య కళాశాలలో, గజ్వేల్ ఆర్బీఎంలో కోవీడ్ టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేసుకున్నామన్నారు.
కోవిడ్ బాధితుల కోసం జిల్లాలో 200 పడకల సామర్థ్యం గల కో విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. అను భవజ్ఞులైన వైద్యులను సరిపడా అందుబాటులో ఉంచా మన్నారు. జిల్లా కేంద్రంలో సరిపడా రెమిడీ సివర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచామన్నారు.
తొలి అనుమతి సిద్దిపేట వైద్య కళాశాలకే...
రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లా కేంద్రాల్లో ఏర్పాటయిన వైద్య కళశాలలో భాగంగా కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ కు సంబంధించి తొలి అనుమతి సిద్దిపేటకే వచ్చిందని మంత్రి అన్నారు. వైద్య కళాశాలకు ఇలాంటి అనుమతులు రావాలంటే సాధా రణంగా మూడేండ్ల సమయం పడుతుందన్నారు. ఈ ల్యాబ్ ద్వారా ప్రతీ 8 గంటలకు ఫలితం వస్తుందన్నారు. షిఫ్ట్కు 96 చొప్పున రెండు షిఫ్ట్లు నడిపి రోజుకు కనీసం 200 మందికి ఫలితాలు వచ్చేలా చూస్తామన్నారు.
రోజుకు 550 మందికి పరీక్షలు...
జిల్లా కేంద్రంతో పాటు, గజ్వేల్ ఆర్వీఎంలో ఏర్పాటు చేసిన కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ల ద్వారా ఒక రోజుకు 550 మం దికి పరీక్షలు చేసే సామర్థ్యం చేకూరిందన్నారు. రాబోయే రోజుల్లో ఆర్ఎన్ ఏ- డిజిటల్ ఎక్స్ ట్రాక్షన్ మెషిన్ జిల్లాకు తెప్పిస్తామని, తద్వారా రోజుకు 600 మందికి పరీక్షలు చేసే సౌలభ్యం చేకూరుతుందన్నారు. కరోనాపై సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దనివిజ్ఞప్తి చేశారు.
మొబైల్ వాహనం ద్వారా పరీక్షలు...
సిద్దిపేట పట్టణంలో వ్యాధి వ్యాప్తి అధికంగా ఉన్న కంటోన్మెంట్ ఏరియాలో మొదట మొబైల్ టెస్టింగ్ బస్ ద్వా రా పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. తదనంతరం గల్లీలోకి మొబైల్ టెస్టింగ్ బస్ను పంపి పరీక్షలు చేపడతామాన్నారు.
ఫ్రంట్ వారియర్స్ కు సన్మానం...
కరోనాపై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న వైద్యులకు ప్రభుత్వ వైద్య కళాశాలలో శాలువాతో మంత్రి సన్మానించారు. ఎమ్మె ల్సీ రఘోత్తం రెడ్డి, అదనపు కలెక్టర్ పద్మాకర్, మున్సిపల్ చైర్మెన్ రాజనర్సు, సుడా చైర్మెన్ రవీందర్ రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ తమిళ అరుసు, జిల్లా వైద్యాధికారి డా మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి...
కొమురవెల్లి మల్లన్న జలశాయ ప్రధాన కాలువ భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అదికారులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సమీకత కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మల్లన్న సాగర్ జలాశయాల ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్స్ ద్వారా వెళ్లే డిస్ట్రిబ్యూటరీ కాల్వలు అంశం పై కలెక్టర్ వెం కట్రామిరెడ్డి, అదనపు కలెక్టర్ పద్మాకర్, ఆర్డీఓ అనంతరెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ ఆనంద్, ఇరిగేషన్ ఈఈ గోపాల కష్ణ, సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఇరిగేషన్ అధికారులతో కాల్వల భూ సేకరణ పురోగతి పై సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. మంత్రి మాట్లాడుతూ ప్రధాన కాలువలో 2ఎల్, 3ఎల్, 4ఎల్ డిస్ట్రిబ్యూటరీ కాల్వలపై ప్రత్యేక దష్టి సారించాలని ఇరిగేషన్, తహసీల్దార్లకు సూచించారు. ఆర్డీఓ అనంతరెడ్డి, ఇరిగేషన్ డీఈలు రవీందర్,శ్రీనివాస్, ఏఈలు మల్లోజి, తహసీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.