Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్
నవతెలంగాణ-గజ్వేల్
బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదు కుంటుందని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని అహ్మదీపూర్ గ్రామంలో గాలి, వర్ష ప్రభావానికి ఇండ్లు కూలిపోవడంతో నష్టపోయిన నాలుగు కుటుంబాలకు చెందిన జంగం కౌసల్య, జంగం ముత్తవ్వ, జంగం శంక రయ్య, టేక్మాల్ సుధాకర్ రావులు ఒక్కొక్కరికి రూ. 3200 చెక్కులను ప్రభుత్వం తరుపున ఆమె అందించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిల సహాకారంతో డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయిస్తామన్నారు. సర్పంచ్ చాడ నవీన శ్రీనివాస్ రెడ్డి,వైస్ ఎంపీపీ కష్ణ గౌడ్, గ్రామ కార్యదర్శి రమేష్ గౌడ్ , అహ్మద్, బుచ్చిరెడ్డి, వార్డు సభ్యులు, నాంపల్లి, బాలయ్య, శ్రీను, తదితరులున్నారు.
రైతుల కండ్లల్లో ఆనందం నింపడమే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావుల లక్ష్యమని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ దాసరి అమరావతిలు అన్నారు. మండలంలోని బేజగామ గ్రామంలో రైతువేదిక నిర్మాణనికి సర్పంచ్ అండాలు ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లను ఏర్పాటు చేశారని వాటి ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ఇప్పటికే రైతుబీమా కోసం రూ.1173.54 కోట్లు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విడుదల చేశారన్నారు. ముఖ్యమంత్రికి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. ఏవో నాగరాజు, వైస్ ఎంపీపీ కష్ణ గౌడ్, ఎంపీటీసీ గంగాధర్, ఏఈవో మాధవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు మధు, వెంగల స్వామి , రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.