Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలిక ఎలా చనిపోయింది?
అమీన్పూర్ ఘటనలో కొనసాగుతున్న విచారణ
వెలుగులోకి కొత్తకోణం
నవతెలంగాణ-అమీన్పూర్
అసలేం జరిగింది..? బాలిక ఎలా చనిపోయింది..? మూత్రాశయంలో ఇన్ఫెక్షన్తోనా.. లేక బంధువులు దాడి చేయడంతో తలకు బలమైన గాయం తగిలి చనిపోయిందా..? ఇంతకీ ఆ అనాధాశ్రమంలో అసలేం జరుగుతోంది.. ఏం జరిగింది..? ఎంత కాలంగా బాలికలపై ఇలాంటి అకత్యాలు జరుగుతున్నాయి..? ఇటువ ంటి విషయాలు ప్రస్తుతం ప్రజల్లో పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. అనా థాశ్రమం పేరుతో ఎన్నో అకత్యాలు జరిగాయంటూ స్థానికంగా జోరుగా ఆరోపణలు వెలు ్లవెత్తుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో గల అనాథాశ్రమంలో 14 ఏండ్ల బాలికపై వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి విరాళం పేరుతో ఏడాది కాలంగా లైంగిక దాడికి పాల్పడు తున్నాడు. అయితే ఆశ్రమ నిర్వాహకులు అందుకు సహకరించారనేది బహిరంగ విషయం. ఇంతకీ బాలిక వ్యవ హారంలో జరిగిన అసలు విషయం ఏంటి? లాంటి నిజాలను నిగ్గు తేల్చేం దుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీ గురువారం ఈ విషయంపై విచారణ చేపట్టింది. సంగారెడ్డి డిస్ట్రిక్ లీగల్ సెల్ మెజిస్ట్రేట్ ఆశాలత ఆశ్రమ సిబ్బందితో మాట్లాడి పలు విషయాలను రాబట్టింది.
ఘటన జరిగిన అమీన్పూర్లోని అనాథాశ్రమంలోని సుమారు 46 మంది విద్యార్థులను నింబోలి అడ్డాలోని మరో ఆశ్రమానికి అధికారులు తరలించారు. ఆశ్రమానికి సంబంధించిన గుర్తింపు సైతం రద్దు చేశారు. అయితే ఆశ్రమం మాటున జరిగిన అకత్యాలను విద్యార్థుల నుంచి తెలుసుకుంటే ఏమైనా కొత్త కోణం బయటపడే అవకాశం లేకపోలేదు. విచారణ అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేశారో లేదో వేచి చూడాల్సి ఉంది.
బాలిక మతి విషయంలో కొత్త కోణం..
అనాథా శ్రమంలో అత్యాచారానికి గురై తీవ్ర అస్వస్థతకు గురైన బాలిక ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ బాలిక తలకు బలమైన గాయం కావడంతో చనిపోయిందంటూ నిలోఫర్ ఆసుపత్రి వైద్యులు పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొన్నారు. కానీ అంతకు ముందు బాలికను పరీక్షించిన వైద్యులు మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ రావడంతోనే చనిపోయినట్టు తెలిపారు. ఈ తరుణంలో నిందితుడిగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి.. బాలిక దూరపు బంధువులు తీవ్రంగా కొట్టడడం వల్లే మరణించిదని పోలీస్స్టేషన్లో కేసు పెట్టినట్టు సమాచారం. వాస్తవానికి అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న సమయంలో బాలిక అస్వస్థతకు గురి అయిందని, తీసుకెళ్లాలంటూ దూరపు బంధువులు అనిల్కు ఆశ్రమ సిబ్బంది సమాచారం అందించారు. ఆ సమాచారం అందుకున్న అనిల్.. సదరు బాలికను తన వెంట ఇంటికి తీసుకెళ్ళాడు. అయితే అక్కడ నడవలేని స్థితిలో ఉండడం.. తీవ్రం అస్వస్థత కావడం వల్ల దుస్తుల్లోనే మల మూత్ర విసర్జన చేసేది. దీంతో సేవలు చేయలేక ఆమెను కొట్టి ఉంటారని, ఆ క్రమంలోనే బలమైన గాయం అయి ఉండవచ్చని అనుమానాలు లేకపోలేదు.
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ అనాధాశ్రమంలో చిన్నారులతో బిక్షాటన చేయించిన ఘటన నేటికి మరిచిపోలేము. కొంత మంది అక్రమార్కులు అనాధ పిల్లలను చేరదీసి వారిని గచ్చిబౌలికి తీసుకెళ్లి భిక్షాటన చేయించేవారు. అనంతరం తిరిగి వారిని అమీన్పూర్ అనాథాశ్రమానికి తీసుకువచ్చేవారు. ఈ విషయాన్ని పసిగట్టిన సైబరాబాద్ పోలీసులు వారిపై పక్కా ప్రణాళికతో దాడి చేశారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సష్టించింది.
బాలికపై లైంగికదాడి జరిగిన అనాథాశ్రమం వాణీ నగర్ అనే కాలనీ పరిధిలోనే ఉంది. ఇది మున్సిపాలిటీ పరిధిలోని శివారు ప్రాంతం కావడంతో అక్కడ మొదటినుంచి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అక్కడి ప్రజలు ఎన్నిసార్లు పోలీసు యంత్రాంగం దష్టికి తీసుకొచ్చినా పట్టించుకోలేదు. పోలీసులు ఈ ప్రాంతంపై దష్టి సారిస్తే అనాథాశ్రమం సిబ్బంది జాగ్రత్తతో వ్యవహరించేవారు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా అమీన్పూర్ పోలీసులు, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.