Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ భారతి హోళికేరి
నవతెలంగాణ-మెదక్ అర్బన్
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని గురుకుల బాలికల పాఠశాల్లో స్కైఫై గణేష్ సెల్ఫీ కాంటెస్ట్ను కలెక్టర్ లాంచనంగా ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు బడికి ఇష్టంగా వచ్చినప్పుడే శ్రద్ధ్దగా చదువు కుంటారన్నారు. అందుకు అనుగుణంగా పాఠశాలల్లో వాతావరణం కల్పించాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉంద ని చెప్పారు. ప్రయివేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునీక పద్ధతుల ద్వారా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే గణేష్ సెల్ఫీకాంటెస్ట్ను ప్రవేశపెట్టామన్నారు. విద్యా ర్థులు సినిమా చానళ్ల కంటే కార్టున్ చానెళ్లనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్నారు. జిల్లాలో లక్ష మంది విద్యా ర్థుల కోసం ఈ కాంటెస్ట్ నిర్వహిస్తున్నామని, ఇందులో అత్యుతమ ప్రతిభ కనబర్చిన ఐదుగురు విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. ప్రతీ విద్యార్థి ఉత్సహాంగా ఈ పోటీల్లో పాల్గొన్నాలని కోరారు. కార్యక్రమంలో డీఈఓ సరోజినీదేవి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, శివాజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.