Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ అర్బన్
సీపీఎస్ను రద్దు చేసేంత వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర నాలుగోతరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు, జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాతపింఛన్ విధానాన్ని కొనసాగించాలని ఆయన కోరారు. సెప్టెంబర్ 1న జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో, కలెక్టరేట్ ఎదుట భోజన విరామం సమయంలో ఉద్యోగులు నిరసన తెలుపాలని వారు పిలుపునిచ్చారు.