Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ అర్బన్
టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొండల్రెడ్డి నేతృత్వంలో బుధవారం మెదక్ పట్టణంలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో ఇతర ఉపాధ్యాయ సంఘాల నాయకులు చేరారు. తపస్ మెదక్ మండల అధ్యక్షులు యాద గిరి, టీటీఎఫ్ అధ్యక్షురాలు స్వప్నలు టీపీటీఎఫ్లో చేరారు. వారికి సభ్య త్వం ఇచ్చి టీపీటీఎఫ్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండల్రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలతో పాటు విద్యారంగ, సామాజిక సమస్యలపై టీపీటీఎఫ్ నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. ఐక్య ఉద్య మాల నిర్మాణంలో టీపీటీఎఫ్ ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్య క్రమంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగయ్య, ఉపా ధ్యక్షులు కాముని రమేష్, నాయకులు జీవరత్నం, సురెందర్, గోపాల్, శ్రీని వాస్, స్వామిదాస్, యాదగిరి, భాగన్న, నాగరాజు, భాస్కర్రెడ్డి, పీర సింగ్, ఉమమహేశ్వర్, రాజు తదితరులు పాల్గొన్నారు.