Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొల్చారం
మండలంలోని రంగంపేట, సంగాయిపేట గ్రామాల్లోని జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలను బుధవారం మండల విద్యాధికారి నీలకంఠం సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా పాఠశాలల్లో నాటిన మొక్కలను పరిశీలించారని తెలిపారు. ప్రతీ పాఠశాలల్లో లక్ష్యానికి అనుగునంగా మొక్కలు నాటాలని చెప్పారు. మొక్కల సంరక్షణలో ప్రతి ఒక్కరూ చూసుకోవాలని కోరారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిచాలని సూచించారు. ప్రతీ పాఠశాలను హరితవనంగా తీర్చిదిద్దాలని, ప్రతీ ఒక్కరు కృషిచేయాలని కోరారు. కార్యాక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.