Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవేళిఘనపూర్: ప్రభుత్వ ఉద్యోగులకు శాపంగా మారిన సీపీఎస్ విధానం రద్దు చేయాలని జాక్టో పిలుపునకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు పీఆర్టీయూ హవేళిఘనపూర్ మండల కమిటీ తెలి పారు. బుధవారం మండల పరిధిలోని రాజ్పేట ప్రభు త్వ పాఠశాలల్లో హెచ్ఎంకు సాముహిక సెలవు పత్రం ను అందజేశారు. ఈ సందర్భంగా పీఆర్టీయు మండల అధ్యక్ష కార్యదర్శులు సంతోష్కుమార్, రఘుబాబులు మాట్లాడుతూ సీపీఎస్ విధానం వల్ల అనేక లోటుపాటులతో పాటు ఉద్యోగ విరమణ తరువాత భద్రత లేని సీపీఎస్ విధానం భవిష్యత్తుపై ఆందోళన గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్దురు: ఉపాధ్యాయ సంఘాల అధ్వర్యంలో పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ మండల పరిషత్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. మండల కేంద్రం నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
తొగుట: పెన్షన్ విద్రోహ దినంను జయపద్రం చేయాలని ఒకటవ సామూహిక సెలవు పెడుతున్నట్టు వెంకట్రావ్పేట జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యా యులు జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం సామూహిక సెలవు పత్రాన్ని పాఠశాల హెచ్ఎం మధుకు అంద జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం సీపీఎస్ను రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు.
సిద్దిపేట టౌన్: సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని జాక్టో స్టీరింగ్ కమిటీ సభ్యులు జైన సత్యం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ రేపు జాక్టో ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాకు అన్ని ఉపాధ్యాయ సంఘాల ఉద్యోగులు అధికసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నంగునూరు: రేపు చేపట్టే పెన్షన్ విద్రోహ దినానికి తెలంగాణ టీచర్ ఫెడరేషన్ పూర్తిగా మద్దతు తెలుపుతున్నట్టు ఆ సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.రవి, జి. లక్ష్మినర్సయ్యలు తెలిపారు. ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
కొండపాకలో: పెన్షన్ ఉద్యోగ హక్కు బహుల జాతుల పెట్టుబడి దారుల ఒత్తిడి మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలొగ్గి 2004 సెప్టెంబర్ 1న ప్రవేశ పెట్టిన సీపీఎస్ వల్ల ఉపాధ్యాయ ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని టీటీఎఫ్ జిల్లా అధ్య క్షులు రామస్వామి అన్నారు. బుధవారం కొండపాకలో విలేకర్లతో మాట్లాడుతూ సీపీఎస్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే దీక్షలు, ధర్నా శిబిరానికి జాక్టో సభ్య సంఘాల పక్షాన పూర్తి మద్ధతు ప్రకటిస్తున్నామని తెలిపారు.
రాయపోల్: సీపీఎస్ విధానంతో ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు తీరని నష్టం వాటిల్లుతుందని టీఎస్ యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి సుధాకర్ అన్నారు. బుధవారం సెప్టెంబర్ 1 - పెన్షన విద్రోహ దినం వాల్పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన తర్వాత 60శాతం డబ్బు కూడా ఇవ్వకపోగా, పెన్షన్ కూడా రావడం లేదన్నారు. కేంద్రం ఆదేశించినా కూడా గ్రాట్యూటీపై నిర్ణయం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ఆలసత్వం ప్రదర్శించడం సిగ్గుచేటన్నారు.