Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ టౌన్
తమ న్యాయమైన సమస్యలు పరిష్కారించాలని కోరుతూ సెర్ప్ ఉద్యోగులు చేపట్టిన సార్వత్రిక సమ్మె 15వ రోజుకు చేరింది. బుధవారం సమ్మెలో భాగంగా ఉద్యోగులు కలెక్టరేట్ ముందు ఒంటికాళుపై నిలుచుని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సెర్ ్ప ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షురాలు నీల మాట్లాడుతూ సెర్ప్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని వర్తింపజేయాలని ఆమె డిమాండ్ చేశారు. కనీస వేతనం ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఇతర ఉద్యోగుల మాదిరిగా సెర్ప్ ఉద్యోగులకు హెల్త్కార్డులు మంజూరి చేయాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసుతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల సెర్ఫ్ ఉద్యోగుల సంఘం నాయకులు రమదేవి, సునీత, ప్రదీప్, సాయిరెడ్డి, సురేష్, మల్లేశం, దశరథ్, రవి తదితరులు పాల్గొన్నారు.