Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైైర్మన్ మల్లికార్జున్గౌడ్
నవతెలంగాణ-మెదక్ అర్బన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా చేడపతున్న మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తామని మున్సిపల్ చైైర్మన్ మల్లికార్జున్గౌడ్ తెలిపారు. బుధవారం మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ శివారులోని గంగమ్మ ఆలయం వద్ద నిర్మించే మిషన్ భగీరథ పైలాన్ కోసం జనరల్ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయిస్తున్నామని కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మాణించారని చెప్పారు. పట్టణంలో పారిశుధ్ద్య నివారణకు ప్రజలు సహకారించాలని ఆయన కోరారు. పేద మైనార్టీల కోసం కుట్టుమిషన్లు మంజురయ్యాయని, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఏ వార్డు ఎంత విస్తీర్ణం ఉందో హద్దులు చూపాలన్నారు. ఒకటవ వార్డు కౌన్సిలర్ తిమ్మన్నగారి అనిల్కుమార్ చైర్మెన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని కౌన్సిలర్లు అనిల్కుమార్, మదుసూధన్రావు, అయితారం నర్సింలు తెలిపారు. మరోసారి అలా జరుగకుండా చూస్తామని చైర్మన్ హామీనిచ్చారు. పట్టణంలో కోతులు, కుక్కలు, పందుల బెడద తీవ్రంగా ఉందని పలువురు కౌన్సిలర్లు చైర్మెన్ దృష్టికి తీసుకెళ్లాగా వాటి నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వైస్ చైర్మెన్ రాగి అశోక్, కౌన్సిలర్లు జెల్లా గాయిత్రి, విజయలక్ష్మీ, సులోచన, బట్టి సులోచన, యాశోద, చంద్రకళ, సలాం, ఆరేళ్ల గాయిత్రి, సోహేల్, రబీన్ దివాకర్, వెంకటరమణ, గంగధర్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.