Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హుస్నాబాద్
వాహన దారులు హెల్మెట్ ధరించాలని పోలీస్శాఖ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని సిదార్థ పాఠశాల విద్యార్థులు బెలున్స్ ఇచ్చి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ జీ మాట్లాడుతూ ప్రయివేట్ పాఠశాల యాజమన్యం వాహన దారులకు బెలున్స్ ఇచ్చి హెల్మెట్ పెట్టుకొవాలని ప్రచారం చేయడం అభినందనీయమన్నారు. ద్విచక్ర వాహనదారు లందరూ హెల్మెట్ ధరిస్తే ఎక్కువ శాతం ప్రమదాలను అరికట్టినట్టవుతుందని, ప్రధానంగా ప్రాణనష్టం జరగకుండా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరాస్పాండెంట్ రాధ, సురేందర్, పిన్సిపాల్ నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.