Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తూప్రాన్
తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామ యూపీఎస్ పాఠశాలను మెదక్ జిల్లా విద్యాధికారి సరోజినిదేవి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పరిశీలించి, వారానికి మూడు రోజులు గుడ్లు పెడుతున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం, కూరగాయలు గురించి విద్యార్థులతో ముచ్చటించారు. అదేవిధంగా పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. పాఠశాలలో హరితహారం కింద నాటిన మొక్కలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీచర్ల కొరత, నీటికొరత, వంటగది తదితర సమస్యలను హెచ్ఎం, డీఈఓ దృష్టికి తీసుకుపోయారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నర్సింలు, కిష్టాపూర్ హెచ్ఎం లక్ష్మణ్ పాల్గొన్నారు.