Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ములుగు శాఖ గ్రంథాలయానికి ములుగు ఎస్ఐ శ్రీశైలం 20 కుర్చీలను విరాళంగా అందించారు. బుధవారం లైబ్రెరియన్ రాజుకు కుర్చీలు అందించి ఎస్ఐ మాట్లాడారు. గ్రంథాలయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనేక రకాల పుస్తకాలు గ్రంథాలయంలో ఉన్నాయని, పుస్తకాలను విలువలను కాపాడాలన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని, అప్పుడే మేధావులుగా ఎదుగుతారన్నారు. పాఠకులు గ్రంథాలయంలో కుర్చీలు లేనందున ఇబ్బంది పడుతున్నారని, ఈ విషయం తెలుసుకుని కుర్చీలు అందించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ పాఠకులు, యువకులు పాల్గొన్నారు.