Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని ప్రాంతాల్లో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం
-దసరా వరకు పూర్తి చేయాలి
-రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్
చైర్మన్ మడుపు భూంరెడ్డి
నవతెలంగాణ-గజ్వేల్
రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం శరవేగంగా జరగాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నియోజకవర్గంలో 220 అవాస ప్రాంతాల్లో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నదన్నారు. ఇవి దసరా నాటికి పూర్తి కావాలని సూచించారు. కాంట్రాక్టర్లు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిం చాలన్నారు. అన్ని గ్రామాల్లో రెండు పడక గదుల నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని రెవెన్యూ అధికారులు, గ్రామ సర్పంచ్, గ్రామ రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి సేకరించాలన్నారు. మిషన్ భగీరథ పనులు గజ్వేల్ పట్టణంలో వేగవంతం కావాల్సిన అవసరముందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో గడ అధికారి హన్మంతరావు, ఎంపీపీలు చిన్న మల్లయ్య, అనంతుల పద్మ, మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్ పర్సన్ దుంబాల అరుణ, ఎంపీడీఓ దామోదర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.