Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మర్కుక్ : సెప్టెంబర్ 1 నుండి 9 వరకు జరిగే రైతు కమిటీ ఎన్నికలకు రైతులందరూ సహకరించి, ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వర్ధరాజ్పూర్ గ్రామంలో వర్ధరాజస్వామి దేవాలయంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు, సర్పంచ్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల రైతులను ఆదుకునేందుకు రైతు సంఘాల ఏర్పాటు చేసుకుందన్నారు. దీనికి మండలంలోని రైతులు, ప్రజాప్రతినిధులు సామరస్యంగా ఎన్నిక చేసుకోవాలన్నారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాల చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లకాక్కుల నరేశ్, ఎర్రవల్లి సర్పంచ్ భాగ్యబాల్రాజు, జగదేవపూర్ సర్పంచ్ కొంపల్లి కర్ణాకర్, నాయకులు ఉపేందర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.