Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొగుట
మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన తొగుట మండలం వేములఘాట్ గ్రామంలో నిర్వాసితులు నిరసన కార్య క్రమాలు కొనసాగుతు న్నాయి. బుధవారంతో వారి రిలే నిరాహార దీక్షలు 452వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం స్పష్టత లేకుండా ముందుకు సాగుతుందన్నారు. డీపీఆర్ విడుదల చేసిన తర్వాత, 2013 చట్టం ప్రకారం తమ భూములను తీసుకుని, న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు హన్మంతరెడ్డి, బాగయ్య, రాజయ్య, బాలయ్య, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.