Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుబ్బాక
వానర సేన యూత్ ఆద్వర్యలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద మంగళవారం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్న దానం కార్యక్రమం నిర్వహించారు. మండపంలో యూత్ సభ్యులు గణపయ్యను భక్తి శ్రద్ధలతో పూజించి గణపతి బొప్పా బోరియా అంటూ నినాదాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్బంగా వానర సేన యూత్ అధ్యక్షులు ఆస రాకేష్్ మాట్లాడుతూ సంవృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని దేవున్ని కోరుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మనోజ్కుమార్, శ్రీధర్, ప్రతాప్, దామోదర్, సిద్దు, చింటు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట టౌన్: అన్నంపెట్టే రైతన్నలకు సిద్దిరామేశ్వర - రాజేశ్వర ఫౌండేషన్ వారు అన్నదానం చేయడం గొప్ప విషయమని టూ టౌన్కు చెందిన కానిస్టేబుల్స్ అశోక్, బాలస్వామిలు అన్నారు. పట్టణంలోని పశువుల సం తలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపకులు మురంశెట్టి రాములు రైతులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.
హావేళిఘనపూర్: మండల పరిధిలోని లింగ్సాన్పల్లి తండాలో గణేష్ నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు నిమజ్జనం చేశారు. మండల కేంద్రంతో పాటు ముత్తాయికోట గ్రామాలల్లో వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చెరువులో నిమజ్జనం నిర్వహించారు.
మెదక్ రూరల్లో.... గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని మండల పరిధిలోని మంబోజిపల్లి, మాచావరం గ్రామాల్లో గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. మంబోజిపల్లిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన శోభయాత్రలో యువకులు కేరింతలు, డప్పుచప్పుల మధ్య నిమజ్జనానికి తరలించారు. బందోబస్తు నిర్వహించారు.
గజ్వేల్: అన్నదానమే మహాదానమని, అన్నదానాల్లో అన్నదానమే గొప్పదని మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో వినాయక మంపడంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
సిద్దిపేట టౌన్: బీజేపీ మజ్దూర్ సెల్ సిద్దిపేట పట్టణ కన్వీనర్గా మోత్కు శ్రీనివాస్ను నియమి స్తున్న ట్టు బీజేపీ జిల్లా అధ్యక్షులు నాయిని నరోత్తంరెడ్డి తెలి పారు. ఈసందర్భంగా మోత్కు శ్రీనివాస్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
నంగునూరు: వీర శివాజీ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేశ్ మండపం వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ దేవులపల్లి యాదగిరి ప్రారంభించారు.
మర్కుక్: టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేశిరెడ్డి నర్సింహరెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన కుటుంబాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, రాష్ట్ర కార్పొరేసన్ చైర్మన్లు నర్సారెడ్డి, భూంరెడ్డి, స్థానిక జడ్పీటీసీ ఎంబరి రాంచంద్రంలు బుధవారం పరామర్శించారు.