Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం
నవతెలంగాణ-కౌడిపల్లి
బహిరంగ మలవిసర్జన చేస్తే రూ. 500 జరిమానా విధిస్తామని గ్రామసభలో తీర్మాణం చేపట్టారు. బుధవారం మండలంలోని భుజిరంపేట ఉన్నత్భారత్ అభియాన్ కింద గ్రామం ఎంపిక కావడంతో గ్రామంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూరైనా బహిరంగ మలవిసర్జన చేయడంపై ఎంపీడీఓ సత్యనారాయణ, ఏపీఓ అంజిరెడ్డి, ఏపీఎం సంఘమేశ్వర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిలుముల నర్సింహారెడ్డిల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో మలవిసర్జన చేసిన వారిపై 500జరిమానా విధించడంతో పాటు ప్రభుత్వ పథకాలు నిలిపివేయడానికి వెనుకాడేది లేదని వారు అన్నారు. రేషన్బియ్యం గత కొన్ని నెలలుగా ఆధార్లింక్ కాకపోవడం, వేలిముద్రలు రాకపోవడంతో సమావేశంలో కాస్త గందరగోలం ఏర్పడింది. ఈపాస్ రావడంతో రేషన్ సరుకులు కిలో తక్కువ ఉన్నా తీసుకోవడం లేదని డీలర్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయికోటి కిష్టమ్మ, ఉపసర్పంచ్ మదుసుధన్రెడ్డి, గ్రామస్తులు ఏసురెడ్డి, వీరేష్, సిద్దిరాములు, అంగన్వాడీ కార్యకర్తలు సద్గుణ, ప్రభాకర్తో పాటు తదితరులు పాల్గొన్నారు.