Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కౌడిపల్లి
రసాయన ఎరువులు వాడకుండా సేంద్రీయ ఎరువులపై రెండవరోజు అవగాహన కల్పించారు. బుధవారం మండలంలోని రామానాయుడు విజ్ఞాన్ జ్యోతి అగ్రికల్చర్ గ్రామీణాభివృద్ధి సంస్థలో పరం పరగత్ కృషి వికాస్యోజన శిక్షణ కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాంనాయక్, ఏడీఏ ఆదిలక్ష్మి అవగాహన కల్పించారు. కొల్చారం, కౌడిపల్లి, చిలప్చెడ్, వెల్దుర్తి మండలాలకు చెందిన రైతులు వందమంది పాల్గొన్నారు. ప్రతీ రైతును సేంద్రియ వ్యవసాయంపై మళ్లించేందుకు దఫాలవారిగా పలువురిని ఎన్నిక చేసి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. పూర్తిగా రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులతో వేప కషాయం, పంచగవ్వ, గోమూత్రంతో సేంద్రియ ఎవురుల తయారీతో మొదటి పంటలో తక్కువ దిగుబడి వచ్చినా రెండు, మూడవ పంటలకు దిగుబడి వస్తుందని వారు అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్అర్జున్రావు, మేనేజ్ డాక్టర్ నాగరాజు, జిల్లా వ్యవసాయాధికారి పరశురాంనాయక్, ఏడీ ఆదిలక్ష్మి, శిక్షకులు ఎల్లారెడ్డి, ముకుందం, ఏఓ రాజు, నుస్రత్, బ్రహ్మకుమారి సంస్థ తదితరులు పాల్గొన్నారు.