Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సిబ్బంది కొరత...పోలీస్ జీపు లేక కిరాయి
- ఆటోలో పెట్రోలింగ్
నవతెలంగాణ-మర్కుక్
పేరుకే అది పోలీస్ స్టేషన్. కానీ పోలీసులకు కావాల్సిన, స్టేషన్కు కావాల్సిన మౌలిక సదుపాయాలు లేవు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ, ఏఎస్ఐ, 4 లేదా 5 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 21 మంది కానిస్టేబుళ్లు ఉండాలి. మర్కుక్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ, ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, 5 మంది కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. రెండు జిల్లాల సరిహద్దుగా మర్కుక్ మండలంలో ఉంది. యాదాద్రి, మేడ్చల్, సరిహద్దు రాత్రి పూట వెళ్లాలంటే పెద్ద సమస్యగా మారింది. పోలీస్ స్టేషన్లో జీపు లేదు. ద్విచక్ర వాహనాల పైన, కిరాయి ఆటోలో రాత్రి సమయంలో పోలీస్ పోట్రోలింగ్ చేయవల్సి వస్తుంది. ఒకే రోజు మండలంలో రెండు క్రైమ్లు జరిగితే పోలీస్ స్టేషన్ ఖాళీగా ఉంటుంది. ఈ సమస్య సరిపడా పోలీస్ సిబ్బంది లేకపోవడం వల్లనే.. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో, వ్యవసాయ క్షేత్రానికి కూతవేటు దూరంలో మర్కుక్ మండల కేంద్రంలోనే ఉంది. మండలంలోనే సీఎం వ్యవసాయ క్షేత్రం ఉంది. పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ సిబ్బంది ములుగు, గౌరారం, జగదేవపూర్, గజ్వేల్ నుండి డిప్యూటేషన్ మీద బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మండలంలో 12 గ్రామ పంచాయతీలు, 6 మధిర గ్రామాలున్నాయి. సరైన సిబ్బందిలేకనే పోలీసులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. భవనం అద్దె భవనం కావడంతో సౌకర్యాలు అంతంతే.. ముఖ్యమంత్రి సొంత మండలంలోనే పరిస్థితి ఈ విధంగా ఉండడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పోలీస్ స్టేషన్ భవనం మంజూరు చేసి, తగిన పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేస్తే శాంతిభద్రతలు ఉంటాయని ప్రజలు కోరుతున్నారు.
నిఘా నీడలో మర్కుక్:
శాంతి భద్రతలు, కాపడడానికి మర్కుక్ పోలీసులు ముందడుగు వేశారు. మండల కేంద్రమైన మర్కుక్, పాములపర్తి, కర్కపట్ల, దామరకుంటలో సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. మిగితా గ్రామాల్లో కూడా దశల వారీగా దాతలు సహాయంతో ఏర్పాటు చేస్తామని, ఎస్ఐ మహబూబ్ అలి తెలిపారు.