Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ టౌన్
నిత్యం ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రయాణించే రోడ్డది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డంతా చిత్తడిగా మరి నరకప్రా యంగా తయారైంది. ఇక వాహనచోదకుల బాధ అంతా.. ఇంతా.. కాదు. రోజు ఇదే దారిగుండా కార్యాలయాలకు వెళ్ళే జిల్లా ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడం దారుణమని పలువురు పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రజాప్రతినిధుల సంగతి చెప్పనవసరం లేదు. పట్టణ శివారులోని డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయ నుండి కలెక్టరేట్కు వెళ్ళే దారిలో హల్దీవాగు వద్ద రోడంత బురదమయంగా మారింది. జిల్లా కలెక్టర్ నిత్యం ఈ రోడ్డు పైనుండే వెళ్తున్న పట్టించుకోకపోవడం దారుణమని పలువురు వాహన దారులు వాపోతు న్నారు. తూప్రాన్-చేగుంట మీదుగా ఇదే దారిగుండా సమీప గ్రామాలకు, హైదరా బాద్ వెళ్ళాలంటే ఇదే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు ఈ రోడ్డు మీదుగానే వెళ్తుండడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమయిపోయింది. వర్షకాలం కావడంతో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ముఖ్యంగా రాత్రి వేళ ప్రయాణించే వాహనదారులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఈ రోడ్డుగుండా ప్రయా ణిస్తున్నారు. అసలే మూలమలుపులు ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డును బాగుచేయించాలని స్థానికులు కోరుతున్నారు.