Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీడిపల్లి జిల్లాకే ఆదర్శం : మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి
నవతెలంగాణ-మనోహరాబాద్
చెట్లు మానవాళికి నిస్వార్థంగా పనిచేస్తాయని, హరిత తెలంగాణ దిశగా అందరూ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. బుధవారం మనోహరాబాద్ మండలంలో 1.21లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. మండల పరిధిలోని రంగాయపల్లి, చెట్ల గౌరారం, అటవీ ప్రాంతంలో 25వేల మొక్కలు నాటారు. జీడిపల్లిలోని వైకుంఠ ధామం, గ్రామ ప్రధాన రహదారిపై అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా అశోక మొక్కలను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. మనోహరాబాద్, తూప్రాన్ మండలాల్లో కోటీ 30 లక్ష్ల్లలు మొక్కలు నాటే లక్ష్యం ఉండగా, 80 లక్షలు మొక్కలు నాటడం పూర్తి చేసినట్టు తెలిపారు. ఇంకా వేగంగా మొక్కలు నాటి టార్గెట్ను పూర్తి చేయాలన్నారు. అడవీ ప్రాంతంలో పండ్ల మొక్కలను పెంచాలని సూచించారు. భౌగోళికంగా 33శాతం ఉండాల్సిన అటవీ ప్రాంతం 20 శాతానికే ఉండడంతో దుష్ప్రభావాలు వస్తున్నాయని తెలిపారు. అడవుల్లో చెట్లు లేకపోవడంతో జంతువులు గ్రామల్లోకి వస్తున్నాయన్నారు. జీడిపల్లి సుందరీకరణ చూసి ఎంతో ఆనందం వేసిందని, ఆ గ్రామం జిల్లాకే ఆదర్శంగా ఉందని కితాబిచ్చారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఉండడంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, మనోహరాబాద్ మండల స్పెషల్ ఆఫీసర్ కోటాజీ, జడ్పీటీసీ సుమన విజయ భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ ఓజె మధు, ఎంపీడీఓ శ్రీనివాస్రావు, ఎంపీటీసీ లక్ష్మీనర్సింలు గౌడ్, సర్పంచ్ రాగం పుష్పరాణి, ఈఓపీఆర్డీ రాఘవరావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు శేఖర్ గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీశైలం గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ మన్నె నాగరాజు, కోనాయపల్లి సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, ఏపీఓ అనిల్, నాయకులు రాగం శ్రీనివాస్ గుప్త, సుధాకర్ రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ, శంకర్, శ్రీనివాస్లతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.