Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నంగునూరు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్బీమా యోజన కింద ప్రతి రైతు పంటలకు బీమా చేయించాలని ఏఓ గీత తెలిపారు. శనివారం విలేకర్లతో ఆమె మాట్లాడారు. బీమా పథకం కింద వరి పంటకు రూ.450, శనగకు రూ.240, పొద్దు తిరుగుడు పంటలకు రూ.315, వేరుశనగ పంటకు రూ.225 చొప్పున ప్రీమియం చెల్లించాలన్నారు. వరి, శనగ, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు పంటలకు ఈ నెల 31 చివరి గడువన్నారు. పంట బీమా ప్రీమియంను అగ్రికల్చర్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైద్రాబాద్ ఆక్సిక్ బ్యాంకుడీలో డీడీ కట్టాలని బాఉయంకు నెంబర్ 00801020 0023922, ఐఎఫ్ఎస్సీ కోడ్ యూటీఐబీ0000008కి ప్రీమియం చెల్లించాలన్నారు. అనంతరం పంట బీమా అప్లికేషన్ ఫారంతో పాటు పట్టాదారు పాసుబుక్, ఆధార్కార్డు, బ్యాంకు అకౌంట్ జిరాక్సులతో పాటు ఏఈఓ లేదా వీఆర్ఓ ధృవీకరించిన పత్రం, ఆర్టీజీఎస్ చేసిన రశీదుతో పాటు పంట బీమా అప్లికేషన్ ఫారంను కంపెనీ ఏజెంట్ రాము (9603872972) కు అప్పగించాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే మీ గ్రామ ఏఈఓను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షులు బద్దిపడగ కిష్టారెడ్డి, ఏఈఓలు మౌనిక, శిరీష, ప్రేమ్సాగర్, తదితరులు పాల్గొన్నారు.