Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేములవాడ రాజన్న వద్ద దర్శించుకున్న టీఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ- నంగునూరు
సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హరీశ్రావు లక్ష మెజార్టీతో గెలుపొందాలని వేములవాడ రాజేశ్వర స్వామికి మొక్కులో భాగంగా నంగునూరు మండల టీఆర్ఎస్ నాయకులు, మండల ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు కూతురు రాజిరెడ్డి హరీశ్రా వును కలిసి టీఆర్ఎస్ గ్రామ నాయకులు, కార్యకర్తలు కలిసి శనివారం వేములవాడ రాజన్న సన్నదిలో తాను పెంచిన గడ్డం, మీసాలతోపాటు తల నీలాలు తీశారు. ఈ సందర్భంగా కూతురు రాజిరెడ్డి మాట్లాడుతూ తన ఇష్టదైవమైన రాజన్నకు మొక్కుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తన కోర్కెలను రాజేశ్వరస్వామి నెరవే ర్చాడని తెలిపారు. అందులో భాగంగానే హరీశ్రావుకు లక్షకు పైగా మెజార్డీ రావాలని మొక్కు కున్నానని తెలిపారు. కోరిక నెరవేరిందని అందుకోసమే మొక్కు తీర్చుకున్నానన్నారు. స్వామి వారిని దర్శనం చేసుకున్న వారిలో మాజీ సర్పంచ్ నార్లపురం శ్రీనివాస్, నాయకులు డాక్టర్ శేఖర్, గోనెపల్లి రాములుగౌడ్, నార్లపురం రాజు, గందమాల కనకయ్య, చేర్యాల మల్లేశం, పుప్పాల చిన్న రాజు, బిక్షపతి, బాపు రమేశ్, రాజు, జి.శ్రీనివాస్ తదితరులున్నారు. అదే విధంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాగుల సారయ్య హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.