Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెల్దుర్తి
నర్సాపూర్ నియోజకవర్గంలో చిలుముల మదన్రెడ్డి గెలుపు అభివృద్ధికి నిదర్శనమని పీఏసీఎస్ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనంతరెడ్డి అన్నారు. మండల కేంద్రం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్రెడ్డి ఘన విజయం సాధించిన నేపథ్యంలో శనివారం శివ్వంపేట మండలంలోని చాకరిమెట్లలో శ్రీసహకార ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో హోమం నిర్వహించిన మదన్రెడ్డిని పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శంకర్గౌడ్, ఎంపీటీసీ అశోక్గౌడ్, శ్రీనివాస్గౌడ్తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.