Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సాపూర్
నర్సాపూర్ మున్సిపాలిటీలో నూతనంగా చేస్తున్న వార్డులను ప్రణాళిక ప్రకారం చేయాలని మండల పరిషత్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్కుమార్కు శనివారం కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన నర్సాపూర్ మున్సిపాలిటీలో 9వార్డులు ఏర్పాటు చేసినందున పక్కపక్కనే ఉన్న కాలనీలను కలుపుకొని వార్డులు చేయాల్సి ఉండగా, దూరంగా ఉన్న వార్డుల్లో కాలనీలను చేర్చడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు. అధికారులు స్పందించి వార్డుల ప్రణాళిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నయీం, సత్యంగౌడ్, ఆంజనేయులుగౌడ్, తొంట వెంకటేశం, లాయక్, తదితరులు పాల్గొన్నారు.