Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సాపూర్
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నర్సాపూర్ నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్లు తెచ్చి తీరుతామని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శనివారం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మండలంలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి దేవాలయాన్ని దర్శించుకొని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా ఉమ్మడి అధ్యక్షులు ఎర్రగొల్ల మురళీయాదవ్తో కలసి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేవిధంగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీపై నమ్మకం ఉంచి తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజల రుణం తప్పక తీర్చుకుంటానన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా నిరంతరం అభివృద్ధికి శ్రమిస్తానన్నారు. తొలిసారి మండలంలోని ఆలయాన్ని సందర్శించుకున్న ఎమ్మెల్యే మదన్రెడ్డికి ఆలయ ఫౌండర్ చైర్మన్ భాస్కర రాయిని ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మండల టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు భారీ స్వాగతం పలికారు. అనంతరం మండల నాయకులు ఎమ్మెల్యే మదన్రెడ్డిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ పెద్ద పట్లోరి మాధవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా ఇంచార్జ్ మన్సూర్, గౌడ సంఘం రాష్ట్ర ఉపాద్యాక్షులు వాల్దాస్ రాధామల్లేశ్గౌడ్, రైతు సమన్వయ స మితి మండల అద్యక్షులు నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గొర్రె వెంకట్రెడ్డి, పిట్ల సత్యనారాయణ, రమణాగౌడ్, కల్లూరి వెంకటేష్, టీఆర్ఎస్వీ జిల్లా అద్యక్షులు సుధీర్రెడ్డి, నవీన్గుప్త, తదితరులు పాల్గొన్నారు.