Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సిద్దిపేట అర్బన్
ఆర్బీఐ నిబంధనల ప్రకారం రైతులకు రుణాలు అందించాలని రైతు రక్షణ సమితి అధ్యక్షులు మారెడ్డి రామలింగారెడ్డి అన్ని బ్యాంకులను డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ బ్యాంకులన్ని రైతులను చిన్న చూపు చూస్తున్నాయని, ప్రయివేటుగా అప్పులు తెచ్చిన రైతులు వాటికి వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. హైకోర్టు స్పందించి ప్రతి జిల్లాకు ఆరో అదనపు న్యాయమూర్తులకు ప్రతీ బ్యాంకు అపులిప్పించే విధంగా ఆదేశాలు జారీ చేసిందని, ఈ అవకాశాన్ని జిల్లాలోని ర ఐలుందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు పన్యాల విష్ణువర్ధన్, గడ్డం శ్రీనివాస్రెడ్డి, మోత్కు లక్ష్మయ్య, రాజేశం, భూపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు