Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి
నవతెలంగాణ- చిన్నకోడూరు
గత నాలుగున్నర ఏండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తిరిగి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాయని ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలలో ఆయన మాట్లా డుతూ పేద ప్రజలకు, రైతులకు సంక్షేమ పథకాలను అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందంజలో ఉందని, 60ఏండ్ల పరిపాలించిన టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేయక రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ సామాజిక వర్గాలకు సంక్షేమ పథకాలను అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఇక టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఐదు సంవత్సరాల పాటు విరామం తీసుకోవాల్సిందే నన్నారు. బీజేపీ ప్రభుత్వం పూర్తిగా తుడుచుకు పెట్టుక పోయిందని, ఇక బీజేపీకి పుట్టగతులుం డవన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామగ్రామాన తిరుగుతూ అనేక సమస్యలను ప్రజలు తెలిపారని, ఎన్నికల కోడ్ ఉండటంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, సోమ వారం నుంచి మండలంలోని సమస్యలు, రెవెన్యూ భూ ప్రక్షాళన, గ్రామాల్లోని వాడల్లో ఉన్న సమస్యలను తీర్చి దిద్దడానికి పూర్తి సహాకారాన్ని అందజేస్తామన్నారు. మం డల వ్యాప్తంగా ప్రజలందరూ నియోజక వర్గంలోనే మొదటి స్థానంలో హరీశ్రావుకు ఓట్లేసి లక్ష పై చిలుకు ఓట్లకు మీ వంతు సహాకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నెల రోజుల పాటు ఎమ్మెల్యే హరీశ్రావు కోసం కష్టపడిన మండల నాయకులకు, గ్రామ స్థాయి నాయకులకు ఎళ్లవేళలా రుణపడి ఉంటా నన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, జిల్లా రైతు సమన్వయ స మితి మెంబర్ కాముని శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్బిరెడ్డి, మధుసూదన్రెడ్డి, ఉన్నారు.