Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నాం
- ఉత్సవ ఆలయ నిర్వహణ కమిటీ
నవతెలంగాణ- సిద్దిపేట ప్రతినిధి
18న వైకుంఠ ఏకాదశి సందర్భంగా మోహినిపుర శ్రీ వేంకటేశ్వర దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ నిర్వహణ కమిటీ తెలి పింది. శనివారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్ టీవీ.నగేశ్విష్ణు, కార్య నిర్వహణాధికారి, కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్, ఎస్ఐలు శ్రీనివాసులు మాట్లాడుతూ సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే శుక్ల ఏకదాశిని వైకుంఠ ఏకాదశి అంటారని, ఈ ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారని తెలిపారు. ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కోంటారని, ఏకాదశి తర్వాత దనురామాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారని తెలిపారు. ఈ రోజున ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని తెలిపారు. ఈ రోజును పురస్కరించుకొని ఈ నెల 18 మంగళవారం రోజున వచ్చు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాన్ని నిర్వహిస్తున్నా మన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేపట్టబోతున్నామని తెలిపారు. ఇందుకోసం పోలీస్, మున్సిపల్, అగ్నిమా పకశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్, ఆర్అండ్బీ శాఖల సహాయ సహాకారాలతో ఏర్పాట్లు చేపట్టబోతు న్నామన్నారు. భక్తుల సౌకర్యార్థం కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చు భక్తులు పాదరక్షలు ధరించకుండా ఆలయానికి రావాలని తెలిపారు. ఈ సందర్భంగా వైకుంఠ ద్వార దర్శన పత్రికను ఆవిష్కరించారు.