Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు
- సారి మంత్రి పదవి కోసం జోరుగా ప్రయత్నాలు
నవతెలంగాణ-తొగుట
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధిం చిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మంత్రి పదవి కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. జర్నలిస్టుగా పనిచేసిన ప్పటి నుంచి సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహి తునిగా ముద్రపడిన సోలిపేట రామలింగారెడ్డి కొత్త కెబినేట్లో బెర్త్ కోసం తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచి విప్లవ పార్టీల ప్రజాసంఘాల్లో పనిచేసి ప్రజా సమస్యలపై స్పందిస్తు జర్నలిజంకు ఆకర్షితులైనా రు. రెండు దశాబ్దాలుగా జర్నలిస్టుగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్శితులై తెలంగాణ రాష్ట్ర సాధనలో చురుకైన పాత్ర నిర్వహించారు. 2001లో కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. 2004 సార్వ త్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోలిపేట రామలింగారెడ్డికి టీఆర్ఎస్ టికెట్ కేటాయించడంతో దొమ్మాట నియోజకవర్గం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేశారు. 2004 ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డిపై 24వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తెలంగాణ సాధన ఉద్యమంలో మరింత క్రీయాశీలకంగా పనిచేశారు. అప్పటి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పా టుపై మాట తప్పటంతో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుంచి వైదొలగ డంతో పాటు, ఎమ్మెల్యే తమ పదవు లకు రాజీనామా చేశారు. 2008 ఉప ఎన్నికల్లో మరోసారి చెరుకు ముత్యంరెడ్డిపై 5 వేలపై చిలుకు ఓట్లతో విజయం సాధించారు. నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా దొమ్మాట నియోజకవర్గం దుబ్బాకగా ఆవిర్భవించింది. 2009లో దుబ్బాక నియోజకవ ర్గానికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చెరుకు ముత్యంరెడ్డి చేతిలో సోలిపేట ఓటమి చెందారు. ఎమ్మెల్యేగా ఓటమి చెందినప్పటికి టీఆర్ఎస్ పార్టీలో చురుకైన పాత్ర నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో దుబ్బాక నియోజక వర్గంలో తెలంగాణ ఉద్యమకారులపై వందలాది కేసులు నమోదయ్యాయి. దుబ్బాక నియోజకవ ర్గాన్ని తెలంగాణ ఉద్యమ ఉవ్వేత్తిన ఎగిసింది. తెలంగాణ ఉద్యమ ప్రభావానికి అప్పటి ప్రజాప్ర తినిధులు నియోజకవర్గంలో పర్యటించలేని పరిస్థితులున్నాయి. 2014లో జరిగిన సార్వ త్రిక ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుండి ముత్యంరెడ్డిపై 37వేలకు పైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్గా పదవిని చేపట్టి దుబ్బాక నియోజక వర్గంలో వందలాది కోట్లతో నియోజకవర్గాన్ని అన్నిరం గాల్లో అభివృద్ది చేశారు. నియోజకవర ్గంలో విద్య, వైద్యం, రోడ్లతో పాటు, ఇంటింటికి తాగునీరు అందించే పథకాన్ని చేపట్టా రు. నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ అభివృద్ధికి పెద్దపీఠ వేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్రెడ్డిపై 62 వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు. నాలుగు పర్యాయాలు విజయం సాధించటంతో పాటు, తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి చురుకైన పాత్ర నిర్వహించటంతో పార్టీలోనీ సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధా లున్నాయి. ముఖ్యంగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా మెలగుతారు. అలాగే టీఆర్ఎస్ పార్టీలోని మంత్రులు హరీష్రావు, కేటీఆర్తో సైతం మంచి సంబం ధాలు కలిగి ఉన్నారు. కొత్త కెబినేట్లో మంత్రి పదవిపై కన్నెసిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పార్టీలోని ముఖ్యమైన సన్నిహిత నేతలతో కలసి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. కొత్త మంత్రి మండలిలో అమాత్య పదవి వరిస్తుందో.. లేదో కొన్ని రోజులు వేచిచూడాల్సిందే...!