Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నంగునూరు
లక్షకు పైగా మెజార్టీతో గెలుపొందిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావును నంగునూరు మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు. శనివారం ఉదయం హైదరా బాద్లోని మంత్రి క్వార్టర్స్లో ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి, జిల్లా పరిషత్వైస్ చైర్మన్ రాగుల సారయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పాలెపు నర్సింలు, సొసైటీ చైర్మన్ కోల రమేశ్గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బద్దిపడగ కిష్టారెడ్డి, నాయకులు కోనేటి సత్యం, వర్దోలు వేణుచక్రవర్తి, తిప్పని నాగేంద్రం, అల్లిబిల్లి నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.