Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్దిపేట కలెక్టర్ కృష్ణ భాస్కర్
నవతెలంగాణ- సిద్దిపేట టౌన్
మెదడుకు పదును పెట్టేదే గణితమని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ గణితం అంటే ఏమిటో అని కొంతమంది విద్యార్థుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. గణిత పితామహుడు శ్రీనివాసరామానుజన్ లాగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. గణితంలాగా తర్కం సాధించే విధంగా మన ఆలోచనలను మార్చుకోవాలన్నారు. ఆర్డీఓ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ గణితాన్ని బాగా అర్థం చేసుకుంటూ గణితం పట్ల ఆసక్తిని పెంపొందించుకొని బాలశాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రతిభా పరీక్షలను నిర్వహించి, శ్రీనివాసరామానుజన్ చిత్ర పటానికి పూలమాలతో అలంకరించారు. ఈ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులను రాష్ట్ర స్థాయికి పంపండం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జామినేషన్ సెక్రటరీ భగవంతయ్య, డీఐఈఓ శ్యాంప్రసాద్రెడ్డి, ఎంఈఓలు రఘోత్తంరెడ్డి, యాదవరెడ్డి, టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షులు అశోక్రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి, సభ్యులు విజేందర్రెడ్డి, అజరురెడ్డి, రవికిరణ్, నర్సింలు, పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. గణిత పితామహుడు శ్రీనివాసరామానుజన్ లాగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. గణితంలాగా తర్కం సాధించే విధంగా మన ఆలోచనలను మార్చుకోవాలన్నారు. ఆర్డీఓ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ గణితాన్ని బాగా అర్థం చేసుకుంటూ గణితం పట్ల ఆసక్తిని పెంపొందించుకొని బాలశాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రతిభా పరీక్షలను నిర్వహించి, శ్రీనివాసరామానుజన్ చిత్ర పటానికి పూలమాలతో అలంకరించారు. ఈ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులను రాష్ట్ర స్థాయికి పంపండం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జామినేషన్ సెక్రటరీ భగవంతయ్య, డీఐఈఓ శ్యాంప్రసాద్రెడ్డి, ఎంఈఓలు రఘోత్తంరెడ్డి, యాదవరెడ్డి, టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షులు అశోక్రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి, సభ్యులు విజేందర్రెడ్డి, అజరురెడ్డి, రవికిరణ్, నర్సింలు, పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.