Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాపన్నపేట
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గామాత ఆలయం ఆదివారం జాతర మూడవ రోజు సెలవు దినం కావడంతో ఏడుపాయల వనమంతా జనంతో కిటకిట లాడింది. ఎటు చూసినా భక్తజనంతో ఏడు పాయల జన సముద్రం గా మారిపోయింది. జాతర రెండో రోజైన శనివారం సందర్శకులు తక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ ఆదివారం సందర్శకులతో హోరెత్తింది. వచ్చిన భక్తు లకు ఏడుపాయల సిబ్బంది ఈవో సార శ్రీనివాస్ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేశారు. జాతరలో పోలీసులు బందోబస్తు నిర్వ హించారు. ఎటు చూసినా బోనాలు శివసత్తుల పూనకాలతో నామస్మరణతో మార్మోగింది.
కొమురవెల్లి: మల్లికార్జున స్వామి జాతరలో రాష్ట్రం నలుమూలల నుంచి ఆదివారం దాదాపు 30 వేల సందర్శకులు స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానికి 5 గంటల సమయం పట్టింది. జాతరకొచ్చిన ప్రజలు స్వామివారికి మట్టి కుండలో అన్నం వండి బోనాలు సమర్పించారు. పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గుట్టపై ఉన్న ఎల్లమ్మ ఆలయానికి ఊరే గింపుతో బోనాలెత్తుకుని అమ్మవారిని దర్శించు కున్నారు. జాతర సందర్భంగా ఆలయా ధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు,ఈవో టంకశాల వెంకటేశం ఉన్నారు.