Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సదాశివపేట టౌన్
కౌన్సిలర్లు పారిశుధ్యంపై దృష్టి పెట్టి పట్టణ ప్రగతికి తోడ్పడాలని అడిషనల్ కలెక్టర్ రాజశ్రీషా అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పురపాలక సంఘం పట్టణ ప్రణాళిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .ఈ సందర్భంగా పట్టణంలోని పారిశుధ్యం, హరితహారం, నిరక్ష రాస్యత వాటిపైన సమస్యలు అడిగి తెలుసు కున్నారు. పట్టణంలో ఇంటి పన్నులు ఎంతవరకు పెండింగ్ ఉన్నాయో మున్సిపల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని బిల్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ కమిషనర్ స్పందన తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్: పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. గజ్వేల్ మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి ప్రారంభమై మార్చి 4 వరకు పట్టణ ప్రగతిని నిర్వహిస్తామన్నారు. అందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు, సీనియర్ సిటిజన్లు, యువకులు సహాకరించాలన్నారు. ప్రతి వార్డులో 15 కమిటీలను వేశామని వారందరినీ పట్టణప్రగతిలో భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. పది రోజుల పాటు జరిగే కార్యకమంలో పారిశుద్ధ్యం, హరితహారం, తడి, పొడి చెత్త తదితర అంశా లపై చర్చిస్తామన్నారు. మున్సిపల్ చైర్మెన్ నేతి చిన్న రాజమౌళి, వైస్ చైర్మెన్ జకీయోద్దీన్, కమిషనర్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
అమీన్ పూర్: పది రోజుల పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రాజర్షి షా కోరారు.ఆదివారం అమీన్ పూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో బాగంగా కౌన్సిలర్లు ,మున్సి పల్ సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహిం చారు. మున్సిపల్ ఛైర్మెన్ తుమ్మల పాండు రంగారెడ్డి, కమిషనర్ సుజాత, పాల్గొన్నారు.
ఐడిఏ బొల్లారం: పట్టణ ప్రగతి సన్నాహక కార్యక్రమం విజయవంతం చేయాలని బొల్లారం మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ రోజాబాల్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నేటి నుంచి మార్చి నాలుగు వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతుందన్నారు. వైస్చైర్మెన్ అనిల్ కుమార్ రెడ్డి, కమిషనర్ సంతోష్ కుమార్, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.