Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి నుంచి పది రోజులపాటు కార్యక్రమాలు
మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి
నవతెలంగాణ-మెదక్
ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ ప్రగతి సాధ్యమవుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. నేటి నుంచి 10 రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టే అంశాలపై ఆదివారం కలెక్టరేట్లో కౌన్సిలర్లు, అధికారులకు అవగాహన
కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతికి సంబంధించి ప్రణాళికతో ముందుకు సాగాలని మున్సిపల్ కమిషనర్, వార్డు స్పెషలాఫీసర్ లను ఆదేశించారు. ఈ నెల 20న నిర్వహించిన సన్నాహక సమావేశంలో పట్టణ ప్రగతి గురించి సీఎం కేసీఆర్ వివరించారని తెలిపారు. పేదలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు నివసించే ప్రాంతాల నుంచి కార్యక్రమం ప్రారంభించాలని సూచించారు. మున్సిపల్ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు పట్టుదలతో పనిచేయాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే మున్సిపల్ చట్టం ప్రకారం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను, తడి పొడి చెత్తను సేకరించే లా ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ప్రతి వార్డు లో కమిటీలు ఏర్పాటు చేశామని, 15 మంది చొప్పున వార్డు అభివ ద్ధికి అందుబాటులో ఉంచామన్నారు. మంచినీటి సరఫరా, రహదారుల దుస్థితి, హరితహారం, స్మశాన వాటికలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ లు, క్రీడా ప్రాంగణాలు, పబ్లిక్ టాయిలెట్లు , సీ టాయిలెట్స్ కోసం స్థలాలు గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. ఖర్చుల విషయంలో పారదర్శకత పాటించాలని, పట్టణంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. వంగిన, తుప్పు పట్టిన, రోడ్ల మధ్యలో ఉన్న విద్యుత్ వైర్లు సమస్యలను, ట్రాన్స్ ఫార్మర్ ల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ పద్ధతిలో నిర్దేశించిన కార్యక్రమాలకు రేటింగ్స్ ఇచ్చి కొత్త మున్సిపాలిటీలకు ఎంపిక చేసి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని ఆయన వివరించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరస్పర సహకారంతో పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నుంచి 31 వరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బ ందాలు తనిఖీలు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి కౌన్సిలర్లు, స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.