Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్కుక్
మండలంలో 16 గ్రామపంచాయతీలకు గాను 22,899 జనాభా, ప్రతీ గ్రామంలో గ్రామ పంచాయతీలలో నర్సరీని ఏర్పాటు చేశారు. ప్రతీ నర్సరీలో ఆరు వేల వివిధ రకాల పండ్ల మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఈ నర్సరీలలో 98 వేల మొక్కలను పెంచారు. రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటేందుకు బయట నుంచి 4,500 మెక్కలను నాటారు. మండలంలో 5,970 ఉఫాది జాబ్ కార్డులకు గాను 11 వేల 566 మంది కూలీలున్నారు. వారితో 88,527 గుంతలు తీయించి 79,166 మొక్కలను నాటారు .హరితహారంలో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించేందుకు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అంతకు ముందు ఎంపీడీవోగా పనిచేసిన కౌసల్యాదేవి, నూతనంగా మర్కుక్ ఎంపీడీవో వీఎల్ అనురాధ పర్యవేక్షణ చేస్తూ గ్రామాలలో హరిత సైనికులకు, పంచాయతీ కార్యదర్శులు మొక్కలను సంరక్షించేందుకు పలు సలహాలు సూచనలు చేస్తూ పచ్చని మండలంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం చేస్తూ మండలాన్ని పచ్చగా చేసేందుకు ముందుకు సాగుతున్నారు.