Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శానమండలి చైర్మెన్ గుత్తాసుఖేందర్రెడ్డి
దేవరకొండ : కోవిడ్-19 వల్లనే ఆర్థిక ఇబ్బందులతో నియోజకవర్గంలో చేపట్టిన రిజర్వాయర్ పనుల్లో ఆలస్యం జరిగిందని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే రవీంద్రకుమార్తో కలిసి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గతంలో కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని డిండి ప్రాజెక్టులో నింపేవాళ్లమని, ప్రస్తుతం అకాల వర్షాల వల్ల వరదలు వచ్చి డిండి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిందన్నారు. అకాల వర్షాల వల్ల వచ్చిన వరదలతో పత్తి, వరి పంట తీవ్రస్థాయిలో నష్టం జరిగిందని, నష్టం అంచనా వేసేందుకు ప్రభుత్వం వ్యవసాయ శాఖకు ఆదేశాలిచ్చిందన్నారు.వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు పురపాలక మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారన్నారు. నియోజక వర్గంలోని పెండ్లిపాకల రిజర్వాయర్ పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆలస్యం జరిగిందని, పనులు కాకపోవడం వల్ల ప్రమాదం నెలకొందన్నారు. వచ్చే సంవత్సరన్నరకాలంలో దేవరకొండ నియోజకవర్గంలోని నక్కలగండి, సింగ రాజుపల్లి, గొట్టిముక్కల రిజర్వాయర్లపై ప్రత్యేక శ్రద్ద పెట్టి పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ుున్సిపల్ చైర్మెన్ ఆలంపల్లి నర్సింహా, వైస్ చైర్మెన్ రహత్అలీ, ఆర్డీఓ గోపిరాం, కమిషనర్ పూర్ణచందర్, కౌన్సిలర్ హన్మంతు వెంకటేశ్గౌడ్ పాల్గొన్నారు.
రూ.కోటీ 17 లక్షల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభాలు
దేవరకొండ పట్టణంలో రూ.కోటీ 17 లక్షల విలువ గల పనులకు శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభాలు చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రూ.50 లక్షలతో నిర్మించే గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్థానిక బస్టాండు సమీపంలో రూ.52 లక్షలతో నిర్మించే మినీ బస్టాండు, సీసీ రోడ్డు, మరుగుదొడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం మున్సిపల్ కార్యాలయంలో రూ.15 లక్షలతో నిర్మించే మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, మున్సిపల్ చైర్మెన్ ఆలంపల్లి నర్సింహా, వైస్ చైర్మెన్ రహత్అలీ, జెడ్పీటీసీ మారుపాకుల అరుణ సురేశ్గౌడ్, డిండి, పీఏపల్లి ఎంపీపీలు సునీత జనార్దన్రావు, వంగాల ప్రతాప్రెడ్డి, ఆర్డీఓ గోపిరాం, డీఎస్పీ ఆనంద్రెడ్డి, కమిషనర్ పూర్ణచందర్, ఆర్టీసీ డీఎం వేణుగోపాల్, గ్రంథాల జిల్లా అధికారి బాలమ్మ, సుబ్బలకిë, ఏఈలు రాజు, భానుప్రకాశ్, మున్సిపల్ మేనేజర్ నరేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.