Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
సీపీఐ(ఎం) ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆన్లైన్ భారీ బహిరంగ సభను నేరేడుచర్ల సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు వీక్షించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ధీరావత్ రవినాయక్, మండల కార్యదర్శి కొదమగుండ్ల నగేశ్, మాజీ జెడ్పీటీసీ ముశం నర్సింహ, వాసా సంపత్, ఎడ్ల సైదులు, సట్టు శ్రీను, కోటి, సిరికొండ శ్రీను, ఆనెగంటి మీనయ్య, గుర్రం ధనమూర్తి, మర్రి నాగేశ్వరరావు, నీలా రామ్మూర్తి, ఎస్కె.హపీజ్, హపీజ్, వీరభద్రం, భిక్షం, లింగయ్య, నాగునాయక్ బిల్లును ఖండించారు. ఈ బిల్లుతో చిన్న, సన్నకారు రైతులను విస్మరించి కార్పొరేట్ శక్తులకు, బడా భూస్వాములకు అనుకూలంగా ఉండే విధంగా ఈ బిల్లు తీసుకొచ్చారని విమర్శించారు. చట్టసభల్లో వామపక్షాలు లేనందువల్ల పాలకవర్గాలు పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్నాయని, రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలు బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.