Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-మునగాల
సీపీఐ(ఎం) నాయకులు ఆరె లింగారెడ్డి చిన్నతనంలోనే అకాల మృతి చెందడం బాధాకరమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి తెలిపారు.విద్యుద్ఘాతంతో లింగారెడ్డి మృతి చెందగా శనివారం మండలంలోని మాధవరంలో సంతాపసభ మండల కార్యదర్శి దేవరం వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.మృతుని చిత్రపటానికి నాగార్జునరెడ్డి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగారెడ్డి గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు.మృతుని తాత, తండ్రి ఆరె పాపిరెడ్డి, పిచ్చిరెడ్డి రాజకీయ వారత్వాన్ని పునికిపుచ్చుకుని నీతి, నిజాయతీగా ప్రజలకు సేవలందించారన్నారు.ఆయన మతి, పార్టీ, ప్రజాసంఘాలకు తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు.లింగారెడ్డి ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు, నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు మేద రమెట్ల వెంకటేశ్వరరావు,కోట గోపి, ధనియాకుల శ్రీకాంత్వర్మ, మండలకమిటీ సభ్యులు ఆరె రామకృష్ణారెడ్డి, స్వరాజ్యం, షేక్ సైదా, శాఖ కార్యదర్శులు వీరబాబు, ఆరె శేఖర్రెడ్డి పాల్గొన్నారు.